News February 9, 2026
పదేళ్లు పాలించి.. ఇప్పుడు మాపై విమర్శలా: రేవంత్

TG: పదేళ్లు పెత్తనం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు తమ ప్రభుత్వంపై విషం చిమ్మడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పదేళ్లు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు వాళ్లే ఉన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయంటే వారే కారణం. ఇప్పుడు మళ్లీ వచ్చి ఓటు వేయాలని అడిగేందుకు అర్హత ఉందా?’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News February 20, 2026
ఆర్టీఐ యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరు: హైకోర్టు

రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. RTI యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు కాంత కుమావత్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ‘ఏ విధమైన ప్రజాప్రయోజనం లేని సందర్భాల్లో సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఇదొక వ్యక్తిగత అంశం. RTI పరిధిలోకి రాదు. ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదు’ అని న్యాయస్థానం పేర్కొంది.
News February 20, 2026
ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్: కేంద్రమంత్రి

ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్ అయిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సదస్సుకు ఐదు లక్షల మందికిపైగా విజిటర్స్ వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలికవసతుల్లో $250 బిలియన్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా డేటా సెంటర్స్, సెమీకండక్టర్ ఫెసిలిటీస్కు సంబంధించిన పెట్టుబడులే ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే ఏఐ మిషన్ 2.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
News February 20, 2026
ఏఐ ఎఫెక్ట్.. రోజుకు 6లక్షల కిలోవాట్ అవర్ల విద్యుత్ ఖర్చు!

ఏఐ వాడకం వల్ల ఆ ఎఫెక్ట్ విద్యుత్, నీటిపై పడుతోంది. ఒక ప్రాంప్ట్ కోసం 0.34 వాట్ అవర్స్ విద్యుత్ అవసరమవుతోంది. ఒక యూజర్ ఏఐ వాడకంతో రోజుకు సగటున 6.8 వాట్స్ అవర్స్ విద్యుత్ ఖర్చు అవుతోందట. ఇక 100 మిలియన్ యూజర్లకు 6.8లక్షల kWh ఖర్చవుతోందట. ఇక ఏఐ డేటా సెంటర్ల నిర్వహణ కోసం నీటిని భారీగా వినియోగిస్తున్నారు. 2023లో 6.1 బిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఉపయోగించినట్లు గతంలో గూగుల్ ఇచ్చిన రిపోర్ట్ చెబుతోంది.


