News June 18, 2024
పదోన్నతులు పొందిన పోలీసులను అభినందించిన SP

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన ఒక ఏఎస్ఐ, ఐదుగురు హెడ్ కానిస్టేబుల్ లను స్థానిక కంట్రోల్ రూమ్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అభినందించారు. పెరిగిన బాధ్యతలను నూతన ఉత్సాహంతో మరింత సమర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. వారికి వివిధ పోలీస్ స్టేషన్లకు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Similar News
News May 7, 2025
28న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
News May 7, 2025
సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
News May 7, 2025
చిత్తూరు: 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం అధికమవుతోంది. శుక్రవారం 4 మండలాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నగరి, తవణంపల్లెలో 41.2, శ్రీరంగరాజపురం-41, సదుం-40.7, చిత్తూరులో 39.4, బంగారుపాలెం-38.7, యాదమరి-38.6, పులిచెర్ల, పూతలపట్టు, సోమల, వెదురుకుప్పం-38.4, రొంపిచెర్ల-38.1, గంగవరం, పెద్దపంజాణి-38, చౌడేపల్లె, గంగాధర నెల్లూరు, ఐరాల, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, విజయపురంలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.