News October 13, 2025
పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి: సీపీ

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు సోమవారం కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ను కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News October 12, 2025
వారినే వరించనున్న.. ఖమ్మం DCC, నగర అధ్యక్ష పదవి

ఖమ్మం DCC, నగర అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు AICC పరిశీలకుడు మహేంద్రన్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 19 వరకు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమై, దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవులు ఎవరికిస్తే బాగుంటుంది. కామెంట్.
News October 11, 2025
ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.