News March 16, 2025

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కోనసీమ డీఈవో

image

అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని డీఈవో సలీం భాషా ఆదివారం పేర్కొన్నారు. జిల్లాలో19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి 1,160 మంది విద్యార్థులు కోసం 19 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో ఐదు మొబైల్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయన్నారు.

Similar News

News March 17, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: విజయవంతంగా కొనసాగిన సీఎం పర్యటన > దేవరుప్పుల: తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి > జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి > సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు > సీఎం పర్యటన పలువురు నేతల ముందస్తు అరెస్ట్ > తూతూ మంత్రంగానే సీఎం పర్యటన ఉంది: తాటికొండ రాజయ్య > అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం నేతలు > జిల్లా అధికారులను అభినందించిన కలెక్టర్

News March 17, 2025

రేగొండ: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

image

రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన చావడి లక్ష్మి నరసయ్య(50) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నరసయ్య.. కుటుంబ ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు గొడవ పడినట్లు చెప్పారు. కాగా మనస్తాపం చెందిన నరసయ్య ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.

News March 17, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!

image

∆}ఖమ్మం నగరంలో సినీ హీరో సుమన్ సందడి∆}రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష∆} తిరుమలాయపాలెం:పురుగుమందు నీళ్లు తాగి వ్యక్తి మృతి∆} సత్తుపల్లి:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు∆} బోనకల్:అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య∆} ఖమ్మం: కారులో మంత్రి పొంగులేటి షి’కారు’∆} ఖమ్మం: అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం: మంత్రి తుమ్మల∆}ఖమ్మంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం

error: Content is protected !!