News March 16, 2025

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కోనసీమ డీఈవో

image

అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని డీఈవో సలీం భాషా ఆదివారం పేర్కొన్నారు. జిల్లాలో19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓపెన్ స్కూలుకు సంబంధించి 1,160 మంది విద్యార్థులు కోసం 19 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో ఐదు మొబైల్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయన్నారు.

Similar News

News November 8, 2025

జగిత్యాల జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా మన్నెగూడెంలో 15.0℃, రాఘవపేట 15.1, గోవిందారం 15.2, కథలాపూర్ 15.3, ఐలాపూర్, మల్లాపూర్ 15.4, జగ్గసాగర్ 15.6, రాయికల్ 15.7, పుడూర్, మద్దుట్ల, కోరుట్ల 15.8, గొల్లపల్లె, మల్యాల, గోదూరు 15.9, పొలాస, పెగడపల్లె 16.2, మేడిపల్లి 16.3, సారంగాపూర్, నేరెల్ల 16.4, జగిత్యాల, తిరమలాపూర్ 16.5, మెట్పల్లె, అల్లీపూర్ 16.6, బుద్దేష్‌పల్లిలో 16.8℃గా నమోదైంది.

News November 8, 2025

కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News November 8, 2025

జిల్లా స్కిల్ పోటీల్లో ఏల్చూరు ZPHSకు రెండో స్థానం

image

బాపట్ల జిల్లా స్థాయిలో జరిగిన ఐటీ, ఐటీఈఎస్, ఆటోమోటివ్ పోటీల్లో ఏల్చూరు ZPHS విద్యార్థులు ప్రతిభ చాటారు. ఐటీ, ఐటీఈఎస్ విభాగంలో విద్యార్థులు రూపొందించిన ఏఐ మోడల్ ప్రాజెక్టుకు రెండో స్థానం దక్కింది. ఈ సందర్భంగా HM మాధవి పుష్పమి అధ్యక్షతన విద్యార్థులు అన్విత, నరేష్, సులేమాన్, హర్షవర్ధన్, విష్ణు, భరత్, శేఖర్‌లతో పాటు ట్రైనర్స్ నాగశ్రీను, నరేంద్రలను టీచర్లు బృందం ప్రత్యేకంగా అభినందించారు.