News November 13, 2025
పదో తరగతి పరీక్ష ఫీ డేట్ ఈనెల 20 వరకు గడువు: డీఈవో

పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు ఈనెల 20 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఫీజు చెల్లించని వారు 20వ తేదీ సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 13, 2025
SSC ఫీజు గడువు NOV 20 వరకు పొడిగింపు

TG: టెన్త్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నవంబర్ 21 నుంచి 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అభ్యర్థులు 2026 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలంది. గడువు లోపు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
News November 13, 2025
NIRCAలో 27 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

రాజమండ్రిలోని ICAR- NIRCAలో 27 పోస్టులకు ఆఫ్లైన్లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి M.Tech, MSc(అగ్రోనమీ), బీటెక్, BSc, MSc( అగ్రికల్చర్/లైఫ్ సైన్స్/అగ్రికల్చర్ డిప్లొమా, మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/జెనిటిక్స్/లైఫ్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21-45ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: nirca.org.in/
News November 13, 2025
ములుగు: కొనుగోలు కేంద్రాల్లో 3802 మెట్రిక్ టన్నుల ధాన్యం

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నేటివరకు 3802.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17% తేమతో 1629.760 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి, 1519 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు రవాణా చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 110.760 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు తెలిపారు. రూ.0.39 కోట్లు రైతులకు చెల్లించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


