News February 25, 2026

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

image

AP: పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి FEB 26 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులోని డేటా ఆధారంగానే UDISE+ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మార్చి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి.

Similar News

News February 26, 2026

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.

News February 26, 2026

BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), సెంట్రల్ రీసెర్చ్ లాబోరేటరీ(ఘజియాబాద్)లో 10 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD(AI, కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News February 26, 2026

అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: KTR

image

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం’ అని తెలిపారు.