News February 23, 2026

పద్మనాభ రెడ్డి గారు.. కాపుల జోలికి రావొద్దు: సానా సతీశ్

image

YCP నేత ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ MP సానా సతీశ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించిన నేపథ్యంలో ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభం కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం కాపుల ఆత్మగౌరవాన్ని వినియోగించుకోవద్దని సతీశ్ సూచించారు.

Similar News

News February 23, 2026

INC: అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు

image

ప్రతిపక్షంగా NDAపై పోరాడాల్సిన INC అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో సిద్దరామయ్య, శివకుమార్‌ల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఝార్ఖండ్‌లో JMMతోనూ విభేదాలున్నాయి. అస్సాం, బిహార్లలో సీనియర్ నేతలు భూపేన్ కుమార్, షకీల్ అహ్మద్ రాజీనామా చేశారు. WBలో ఉనికి కోల్పోగా, GJ, UPలోనూ అదే స్థితికి చేరుతోంది. TNలో సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు. అటు కేరళలోనూ ఇంటర్నల్ విభేదాలున్నాయి.

News February 23, 2026

ఎండల్లో వర్షాలు.. పొంచి ఉన్న జ్వరాల ముప్పు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పగటిపూట ఎండలు దంచికొడుతుండగా రెండ్రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇలా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తాజా ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News February 23, 2026

గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

image

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.