News February 23, 2026
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్: CBN

AP: పనితీరు సరిగా లేని ఉద్యోగులను మోటివేట్ చేయడంతోపాటు పని చేస్తున్న వారిని ప్రోత్సహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ప్రతినెల ఉద్యోగుల పనితీరును మదింపు చేయాలి. బాగా పనిచేస్తున్న వారికి అభినందన లేఖ పంపాలి. ఇకపై పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలి. వ్యక్తిగత రికార్డుల్లో ఆ పాయింట్లు నమోదు చేయాలి’ అని వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో CM సూచించారు. రెవెన్యూ శాఖపై ఉన్న చెడ్డపేరు పోవాలన్నారు.
Similar News
News February 26, 2026
PHOTOS: కమనీయం.. లక్ష్మీనారసింహుడి కళ్యాణం

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం నిన్న సింహలగ్నంలో కనులవిందుగా జరిగింది. ఈ ఘట్టాన్ని చూస్తున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. రాష్ట్ర ప్రభుత్వం, TTD, భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు, స్వర్ణగిరి ఆలయం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. విద్యుత్ వెలుగుల మధ్య ఆలయం వెలిగిపోయింది.
News February 26, 2026
NCERT పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లోతైన కుట్ర చేసినట్లు అనిపిస్తోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, NCERT ఛైర్మన్కు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించారు. విచారణ సందర్భంగా NCERT అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పింది.
News February 26, 2026
భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే..

T20WC: నేడు వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలిస్తే 4 పాయింట్లతో ఆ జట్టు సెమీస్లోకి అడుగుపెడుతుంది. అదే సమయంలో INDకు కొంత మేలు జరుగుతుంది. భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా నేరుగా సెమీస్కు వెళ్తాం. ఒకవేళ ఇవాళ WI గెలిస్తే సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. దాంతోపాటు మనం భారీ తేడాతో జింబాబ్వే, WIపై గెలిచి విండీస్ NRRను దాటాల్సి ఉంటుంది.


