News April 13, 2025

పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం: సీతక్క

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పనులు దక్కించుకొని సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకే నిధులు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Similar News

News September 15, 2025

HNK: ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ప్రభుత్వ ఉపాధి కల్పన శిక్షణ శాఖ, ఐటీఐ హనుమకొండ, ATC/ITIలో మిగిలిన సీట్లకు ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జి సక్రు ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విధ్యా సంవత్సరానికి గాను 4th Phase వాక్ ఇన్(స్పాట్) అడ్మిషన్ల గడువును ఈనెల 30న వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ 9490855355, 9908315560ను సంప్రదించాలని అన్నారు.

News September 15, 2025

గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్‌కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.

News September 15, 2025

బల్దియా ప్రజావాణిలో 99 దరఖాస్తులు: కమిషనర్

image

ప్రజావాణి వినతుల పరిష్కారంపై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని 99 దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తత్వరమే పరిష్కరించాలని అన్నారు.