News August 10, 2025
పరిటాల చెరువులో రూ. 4 కోట్ల వజ్రం లభ్యం

కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని చెరువులో 52 క్యారెట్ల వజ్రం లభించినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ వజ్రాన్ని రూ. 2.20 కోట్లకు విక్రయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాన్ని నిజాం నవాబులు పాలించడం వల్ల ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతోందని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
సంగారెడ్డి: ఏడుగురి వైద్యులకు నోటీసులు జారీ: కలెక్టర్

సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో తనఖీ చేసిన సమయంలో సరైన రీతిలో స్పందించని ఏడుగురు వైద్యులకు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో వైద్యులు విజయశంకర్, సత్యనారాయణ, దివాకర్, యాదగిరి, మల్లికార్జున్, ఉమామహేశ్వరి, రత్న సాయి ఉన్నారు. మూడు రోజుల్లో వివరణ పంపాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
News August 13, 2025
ఈనెల 25న వర్ధన్నపేటలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండవ విడత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 25న సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్రతో నియోజకవర్గంలోకి చేరుకుంటారని, 26న ఉదయం 7 నుంచి 10 గంటల వరకు శ్రమదానం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10:30కు వరంగల్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా, పాదయాత్ర రూట్ ఖరారు కావాల్సి ఉంది.
News August 13, 2025
సిద్దిపేట: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం

నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్లు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.