News December 19, 2024

పరిటాల రవి హత్య ఎలా జరిగిందంటే?

image

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి <<14915888>>బెయిల్<<>> మాంజూరైన విషయం తెలిసిందే. కాగా అనంతపురంలో 2005 జనవరి 24న రవి హత్యకు గురయ్యారు. కార్యకర్తల సమావేశం కోసం జిల్లా టీడీపీ కార్యాలయానికి రాగా ఆయనపై మొద్దుశీను, నారాయణరెడ్డి కాల్పులు జరిపారు. కొందరు బయట బాంబులు వేశారు. కాల్పుల్లో ఆయన చనిపోయారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులుగా ఉన్నారు. ఏ-1మొద్దు శీను, ఏ-2 మద్దెలచెరువు సూరి కేసు విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు.

Similar News

News November 8, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.

News November 8, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.