News August 26, 2024

పరిశ్రమల యాజమాన్యాలతో 27న సమావేశం: VZM కలెక్టర్

image

జిల్లాలోని భారీ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో భద్రతపై ఈ నెల 27న ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలోని ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల యజమానులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.

Similar News

News October 1, 2025

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తూర్పు భాగవతానికి చోటు

image

ఇన్క్రెడిబుల్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తూర్పు భాగవతానికి చోటు లభించింది. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరరావు తూర్పు భాగవతం ప్రదర్శన చేయడంతో పాటు కళను బతికించేందుకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తున్నారు. తండ్రి నుంచి నేర్చుకున్న కళను భవిష్యత్ తరాలకు అందించాలని ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నట్లు శంకరరావు చెప్పారు.

News October 1, 2025

సీఎం పర్యటన.. 600 మందితో బందోబస్తు: VZM SP

image

సీఎం చంద్రబాబు బుధవారం దత్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ హెలిప్యాడ్, సభాస్థలం, కాన్వాయ్ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామానికి వెళ్లే రహదారులు చిన్నవిగా ఉండటంతో వాహనాలు రహదారిపై నిలపకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News September 30, 2025

సీఎం చంద్రబాబు టూర్ టైమింగ్స్ ఇవే..

image

➤ఉదయం 11:10 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు
➤ఉదయం 11:20కి హెలీకాప్టర్‌లో స్టార్ట్ ➤ఉదయం 11:30కి దత్తి హెలీప్యాడ్‌కు చేరిక
➤11:40 వరకు ప్రముఖుల ఆహ్వానం ➤11:50కి దత్తి గ్రామానికి రోడ్డు మార్గంలో చేరిక
➤11:50 నుంచి మ.12:05 వరకు డోర్ టూ డోర్ పింఛన్ల పంపిణీ
➤12:10కు ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు ➤ మధ్యాహ్నం 2:10 వరకు ప్రజా వేదిక వద్ద
➤2:15కి పార్టీ కేడర్‌తో మీటింగ్ ➤సా.4 గంటలకు తిరుగు ప్రయాణం