News February 24, 2025
పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ) ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 24 సోమవారం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్ రూల్లో కోర్టు జోక్యం చేసుకోలేదు.
News September 15, 2025
జగిత్యాల: ‘పీఏసీఎస్ పదవీకాలం పొడిగించాలి’

జగిత్యాల జిల్లాలోని 23 పీఎసీఎస్ సొసైటీల బోర్డుల పదవీకాలం పొడిగించాలని కోరుతూ జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు సోమవారం బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. బోర్డుల పదవీకాలం ముగిసినందున కొత్త ఎన్నికలు జరిగే వరకు చైర్మన్లు, డైరెక్టర్లను కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
News September 15, 2025
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.