News February 15, 2025

ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకుందాం: కలెక్టర్

image

ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణంలో ప‌ని చేద్దామ‌ని స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌దర్శ‌కాల‌కు అనుగుణంగా ఫిబ్ర‌వ‌రి నెల 3వ శ‌నివారం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, క‌ళాశాలలు, పాఠ‌శాల‌లు, ఇత‌ర‌ సంస్థ‌ల ప‌రిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 12, 2025

విశాఖలో రూ.100కు చేరిన నిమ్మ..! 

image

విశాఖ 13 రైతు బజార్‌లో బుధవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.16, ఉల్లి రూ.23, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.30, బెండ రూ.42, బీరకాయలు రూ.48 , క్యారెట్ రూ.22/26, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, గ్రీన్ పీస్ రూ.54, గుత్తి వంకాయలు రూ.36, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, నిమ్మకాయలు రూ.100, ఉసిరి కాయలు(హైబ్రిడ్) రూ.100, పొటల్స్ రూ.90గా నిర్ణయించారు.

News March 12, 2025

గాజువాక: ఎలక్ట్రికల్ పోల్ పడి ఒకరు మృతి 

image

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో కే.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News March 12, 2025

విశాఖ: రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అలర్ట్

image

జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయినవారు TDR పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు మంగళవారం తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అధికారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు పరిశీలించి TDRపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. పూర్తి వివరాలకు జోనల్ కార్యాలయాలలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!