News February 24, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News November 14, 2025
VKB: పోలీసు శాఖలో టెన్షన్.!

వికారాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగంలో బదిలీల టెన్షన్ పట్టుకుంది. తాండూరు సబ్ డివిజన్కు సంబంధించిన పోలీసులపై చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారులను బదిలీ చేస్తారా.. వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందని చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఐలు, పెద్దేముల్ ఎస్ఐ, బషీరాబాద్ ఎస్ఐల బదిలీ తప్పదని ప్రచారం జరగుతోంది. తాండూర్ డీఎస్పీగా నేడు నర్సింగ్ యాదయ్య బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం.
News November 14, 2025
మాజీ AVSO సతీశ్ మరణంపై YCP ట్వీట్

మాజీ <<18284097>>AVSO సతీశ్<<>>ది ఆత్మహత్యే అని ఆయన సన్నిహితులు చెప్పారంటూ YCP ట్వీట్ చేసింది. ‘సతీశ్ మరణానికి ముందు గోడును సన్నిహితుల వద్ద వెళ్లబోసుకున్నాడట. పరకామణి కేసులో సిట్ బృందం అప్పటి CIలు జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖర్, సతీశ్ కుమార్, SI లక్ష్మిరెడ్డిని వేధించి విచారణలో తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి చేశారట. వీటిని తట్టుకోలేకే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అన్నారు’ అంటూ రాసుకొచ్చింది.
News November 14, 2025
జూబ్లీ బలం: ఈ నెలలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం కాంగ్రెస్కు, ప్రభుత్వానికి ఊపు ఇచ్చింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు GOVT సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 42% BC రిజర్వేషన్లకు లీగల్ సమస్యలుండడంతో మొత్తం 50% లోపే అవి ఉండేలా అధికారులు మరో నివేదికను ఇప్పటికే రెడీ చేశారు. దీనిపై BCల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ నేతలకు వివరించాలని మంత్రులకు CM సూచించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ నెలాఖరులో రావచ్చని భావిస్తున్నారు.


