News February 24, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News January 7, 2026
వనపర్తి, పెబ్బేర్ మున్సిపాలిటీలకు రూ.3.73 కోట్లు

వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.3.73 కోట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంజూరు చేయించారని స్థానిక కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నిధులతోవీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలను నిర్మిస్తారని వారు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
News January 7, 2026
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ అధికారిక సెల్ ఫోన్ ఎక్కడ..?

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్కు చెందిన అధికారిక సెల్ ఫోన్ కనిపించట్లేదని సమాచారం. సుమారు రూ.1.20 లక్షల విలువైన సామ్సంగ్ కంపెనీకి చెందిన ఫోన్ మాజీ వీసీ డా.నందకుమార్ రెడ్డి ఉన్నపుడే కొనుగోలు చేశారు. నవంబర్ 26న ఆయన వీసీ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి వీసీ సెల్ ఫోన్, అధికారిక నంబర్ విశ్వవిద్యాలయంలో లేదని తెలిసింది. కొత్త వీసీ వచ్చినా సెల్ ఎవరి దగ్గర ఉందనేది చర్చనీయాంశంగా మారింది.
News January 7, 2026
30ల్లో స్కిన్ కేర్ ఇలా..

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్, ఫేషియల్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా మంచిది.


