News March 21, 2025

పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్, డీఈఓ ప్రణీత తదితరులు ఉన్నారు.

Similar News

News March 22, 2025

రాష్ట్రపతి అల్పాహార విందుకు ఎంపీ నగేష్

image

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కల్చరల్ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు శుక్రవారం ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేశ్ హాజరయ్యారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా& నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ ఇతర రాష్ట్రాల కీలక అంశాలపై చర్చించారు.

News March 21, 2025

ఖండాలలో నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గ్రామం నుంచి 4 KM దూరంలో ఉన్న వాగు వద్ద బోర్వెల్ వేసి అక్కడి నుంచి పైపు లైన్ ద్వారా గ్రామంలోని GLSR ట్యాంకుకు నీరు సరఫరా చేస్తామన్నారు. రోజు ఉదయం 7గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10,000 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

News March 21, 2025

ఆదిలాబాద్ డైట్ కళాశాలలో ఉద్యోగాలు

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ఫోటోలతో ఈ నెల 22 నుంచి 24 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను నమూనా తరగతుల ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.

error: Content is protected !!