News October 31, 2025

పర్యాటకులకు గుడ్ న్యూస్.. విజయవాడ-అరకు డైరెక్ట్ ట్రైన్

image

విజయవాడ మీదుగా అరకు-యలహంక మధ్య స్పెషల్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. NOV 14,18,24,25న యలహంక-అరకు, 13,17,23,24న అరకు-యలహంక మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. పై తేదీలలో యలహంక నుంచి మధ్యాహ్నం 1.30/2 గంటలకు, అరకులో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరతాయన్నారు. మార్గమధ్యంలో రాజమండ్రి, అనకాపల్లి, దువ్వాడ, తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

Similar News

News October 31, 2025

17 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

image

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి జరగనున్నాయి. 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 17న ధ్వజారోహణం, చిన్నశేష, 18న పెద్దశేష, హంస, 19న ముత్యపుపందిరి, సింహ, 20న కల్పవృక్షం, హనుమంత, 21న పల్లకీ, గజ, 22న సర్వభూపాల, స్వర్ణరథం, గరుడ వాహన సేవ జరుగుతుంది. 23న సూర్యప్రభ, చంద్రప్రభ, 24న రథోత్సవం, అశ్వవాహనం, 25న పంచమీతీర్థం, ధ్వజావరోహణం.

News October 31, 2025

కాసిపేట: అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

image

కాసిపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు. ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలన్నారు.

News October 31, 2025

అమలాపురం: నవంబర్ 4న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఐటీ రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. వికాస ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నవంబర్ 4వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో వికాస ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరుగుతుందని, ఐటీ రంగ యువత దీనిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.