News March 20, 2025

పర్యాటకులను మెప్పించేలా మరుగుదొడ్లు: కమిషనర్ 

image

వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నగరంలోని కేటీ రోడ్, జక్కంపూడి, వైవీఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలన్నారు. నూతన మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. మహిళల కోసం ప్రతి సర్కిల్లో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న STP లు, రిజర్వాయర్లు, పిగ్ షెడ్ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు.

Similar News

News March 21, 2025

పట్టుబడిన కీచక ప్రొఫెసర్.. వెలుగులోకి కీలక విషయాలు

image

విద్యార్థినులపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న UPలోని హథ్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ రజినీష్ కుమార్ పోలీసులకు దొరికాడు. మార్కులు వేస్తానని, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలపై కొన్నేళ్లుగా అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి దృశ్యాలు రికార్డ్ చేయడానికి అతను కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడన్నారు. నిందితుడికి 1996లో పెళ్లైనా పిల్లలు లేరని తెలిపారు.

News March 21, 2025

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా!

image

వాతావరణంలో మార్పుల వల్ల పెద్దపల్లి జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు వేసవి నేపథ్యంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత పెరుగుతుంది. వ్యవసాయదారులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో ముత్తారం మండల కేంద్రంలో 37.8℃ గరిష్ట ఉష్ణోగ్రతలు, జూలపల్లి 22.0℃అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

News March 21, 2025

నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

image

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్‌లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్‌ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.

error: Content is protected !!