News December 23, 2025

పర్యాటక హబ్‌గా నంద్యాల జిల్లా: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News January 3, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్
సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ చేరాలి: ఎమ్మెల్యే శిరీష
నరసన్నపేట: రహదారులపై పారుతున్న మురుగు నీరు
జలుమూరు: ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రపంచ తెలుగు మహాసభలకు పొందూరు వాసికి ఆహ్వానం
టెక్కలి: ధాన్యం కొనుగోళ్లులో కానరాని కస్టోడియన్లు జాడ
ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించండి: ఎమ్మెల్యే బగ్గు
జిల్లాలో పలుచోట్ల రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ

News January 3, 2026

జగిత్యాల: ‘నాణ్యమైన విద్య బోధనకు కృషి చేయాలి’

image

నాణ్యమైన విద్య బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్‌ను అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా విద్యాధికారి రాముతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. మచ్చ శంకర్, బైరం హరికిరణ్ పాల్గొన్నారు.

News January 3, 2026

కొండగట్టు: పవన్‌తో పాల్గొననున్న ప్రముఖులు వీరే..!

image

కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు ఆనందసాయి, మహేందర్, టీటీడీ ఎల్ఏసి చైర్మన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివశ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి పాల్గొననున్నారు.