News March 20, 2026
పలమనేరు మాజీ MLA మృతి

పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (106) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పెన్షన్తో జీవనం సాగించారు.
Similar News
News March 27, 2026
రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. APR 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఆస్కారముందని చెప్పింది. ఇక రేపు 8.30am వరకు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 27, 2026
వరంగల్: జనగణన తొలి దశకు సర్వం సిద్ధం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న మొదటి దశ జనగణన, ఇళ్ల గుర్తింపు సర్వేకు అధికారులు సిబ్బందిని కేటాయించారు. ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున నియామకాలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో 1135, హనుమకొండలో 1030, మహబూబాబాద్లో గరిష్టంగా 1702 మందితో పాటు మిగిలిన జిల్లాల్లోనూ వివిధ శాఖల నుండి సూపర్ వైజర్లను నియమించి కసరత్తు పూర్తి చేశారు.
News March 27, 2026
హైదరాబాద్: రూ. 217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


