News March 27, 2024
పలాసకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య
పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40), జమ్మూకశ్మీర్ ఉదంపూర్లోని యూనిట్లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
Similar News
News September 29, 2024
శ్రీకాకుళం: హోంమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్
భారత విమానయాన రంగ పురోగతిపై సమీక్షించడంతో పాటు పలు అంశాలపై చర్చిండానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ఢీల్లిలో సమావేశం అయ్యారు. ఈ మెరకు శ్రీకాకుళం నగరంలోని కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయము నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. భారత విమానయాన రంగ పురోగతిపై పూర్తిస్థాయిలో సహకరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.
News September 29, 2024
సండే స్పెషల్: సిక్కోలు కళారూపం ‘తప్పెటగుళ్లు’
శ్రీకాకుళం జిల్లా యాదవులు కళారూపంగా “తప్పెటగుళ్లకు” ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తప్పెటగుళ్ల సంప్రదాయ నాగరికతను పూర్వీకులు నుంచి కొనసాగిస్తున్నారు. యాదవ కుటుంబాలకు పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం జీవనాధారం. పశుగ్రాసం కష్టతరమైన సమయంలో దైవానుగ్రహం కోసం తప్పెటగుళ్లతో పూజలు చేస్తారు. ఇక పండగలు, గావు సంబరాల్లో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది.
News September 29, 2024
షూటింగ్ పోటీల్లో టెక్కలి విద్యార్థిని ప్రతిభ
సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్జ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్ లో 400 షూట్లకు గాను 391 పాయింట్లు సాధించింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.