News March 27, 2024

పలాసకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

image

పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40), జమ్మూకశ్మీర్‌ ఉదంపూర్‌లోని యూనిట్‌లో జేసీఓ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జమ్మూకశ్మీర్‌ నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 22, 2026

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు

image

జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆర్. సురేష్ కుమార్ చెప్పారు. 71 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 39,838 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 71 మంది చీప్ సూపరింటెండెంట్లు, 831 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.

News February 22, 2026

శ్రీకాకుళం: నకిలీ పాసుల కేసు తీవ్ర జాప్యం!

image

ఆదిత్యుని ఆలయంలో జరిగిన రథసప్తమి వేడుకల్లో నకిలీ వీఐపీ పాసులు కేసును సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తొలుత దర్యాప్తు చేశారు. అనంతరం మొదటి పట్టణ స్టేషన్ పోలీసులకు కేసు అప్పగించారు. దాదాపుగా నకిలీ పాసులు వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించారు. అయితే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రాజకీయ మద్దతు ఉండటం కేసు జాప్యానికి కారణమనే చర్చ నడుస్తోంది.

News February 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯టెక్కలి: చోరీ కేసుల్లో పాత నేరస్థుడి అరెస్ట్
✯క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే కూన
✯బూర్జ: ఘోర అగ్నిప్రమాదం.. 50 ఎకరాల్లో ఆస్తి నష్టం
✯శ్రీకాకుళం: మహిళ కడుపులో నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు
✯శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంత మంది రాయనున్నారంటే?
✯జిల్లాలో పలుచోట్ల అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం