News April 20, 2024

పలాస: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

image

పలాస రైల్వే స్టేషన్‌లో స్థానిక జీఆర్పీ పోలీసులు శుక్రవారం బిహార్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. భువనేశ్వర్ నుంచి విశాఖ వెళుతున్న ఇంటర్‌సీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఐదుగురు యువకులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించగా 27 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News September 30, 2024

జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి

image

జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.

News September 30, 2024

జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి

image

జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.

News September 30, 2024

అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం

image

అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.