News April 21, 2024

పలాస: ఈ నెల 28న షర్మిల రాక

image

పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల ఈనెల 28వ తేదీన జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా టెక్కలి, పలాసలో పర్యటించనున్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు టెక్కలి, రాత్రి 7.30 గంటలకు పలాసలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దువ్వాడ తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, ఇండియా ఫోరం పార్టీల శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.

Similar News

News October 11, 2024

శ్రీకాకుళం: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దసరా పండగ మంచి విజయానికి చిరునామాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఆనందంగా, సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు.

News October 11, 2024

దువ్వాడ శ్రీనివాస్‌, మాధురిపై పెట్టిన కేసులు ఇవే..!

image

తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తిరుమల DSP విజయశేఖర్ స్పందించారు. ‘తిరుమల మాఢ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయమై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ వాళ్లు మాకు ఫిర్యాదు చేయడంతో BNS 293, 300 సెక్షన్ల కేసు నమోదు చేశాం. తిరుమలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడకపోవడం మంచిది’ అని డీఎస్పీ సూచించారు.

News October 11, 2024

నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ

image

మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. నిన్న రాత్రికి జిల్లావ్యాప్తంగా 3,427 దరఖాస్తులు అందినట్లు ప్రొహిబిషన్&ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం 825-32 షాపులు, ఆమదాలవలస 268-13, రణస్థలం 502-15, పొందూరు281-10, నరసన్నపేటలో 193-12, కొత్తూరు 178-7, పాతపట్నం 177-8, టెక్కలి 184-11, కోటబొమ్మాళి 224-15, పలాస 154-15, సోంపేట 233-12,ఇచ్చాపురం 208-8 దరఖాస్తులు వచ్చాయన్నారు.