News December 4, 2024

పలు మెట్రో రైళ్లు మెట్టుగూడ వరకే..!

image

HYDలో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో మెట్రో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు డైరెక్ట్ మెట్రో సేవలకు బదులుగా, రాయదుర్గం నుంచి మెట్టుగూడ వరకు పలు రైళ్లను నడుపుతోంది. మెట్టుగూడ నుంచి తిరిగి రిటర్న్ రాయదుర్గం వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 8, 2025

గ్యారెంటీలకు జూబ్లీహిల్స్‌లో BRS గెలవాలి: హరీశ్‌రావు

image

సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. షేక్‌పేట్‌లోని అంబేడ్కర్ నగర్‌ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

News November 8, 2025

HYD: ‘బస్తర్ హననంపై మీడియా మౌనం ఎందుకు’

image

దేశంలో దారుణమైన ఘటనలు జరిగినప్పుడు పలు కథనాలను ప్రచురించే మీడియా బస్తర్‌లో జరుగుతున్న హననంపై మౌనం ఎందుకు వహిస్తుందో గమనించాలని మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. SVKలో పౌర హక్కుల సంఘం తెలంగాణ 3వ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని మీడియా సంస్థలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఢిల్లీలో ఉందని, అందుకే మీడియా సంస్థలు మౌనం వహిస్తున్నాయని అన్నారు. రఘునాథ్, ప్రొ.హరగోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

News November 8, 2025

ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో శాండ్‌ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్‌ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్‌ ఉంటుంది.