News December 2, 2024
పల్నాటి వీరుల చరిత్రను ఎప్పుడు ముద్రించారో తెలుసా?

పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు 300 సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించగా, ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దం) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతంలో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతం పేరుతో మనోహరమైన పద్యకావ్యంగా రచించారు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911లో అచ్చువేయించారని సమాచారం.
Similar News
News April 14, 2026
అమరావతిలో అమృత వర్సిటీ క్యాంపస్

రాజధాని అమరావతిలో అమృత విశ్వవిద్యాపీఠం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన నూతన క్యాంపస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమరావతిలో సుమారు 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాంపస్ను నిర్మించనున్నారు. రాజధానిలోకి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల రాకతో ఇక్కడి విద్యార్థులకు మరింత మెరుగైన ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
News April 14, 2026
అన్ని వర్గాల హక్కుల ప్రదాత రాజ్యాంగ నిర్మాత: లోకేశ్

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో నివాళులర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని లోకేశ్ కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు.
News April 14, 2026
GNT: జపాన్ రాయబారితో నారా లోకేశ్ భేటీ

ఢిల్లీ పర్యటనలో జపాన్ రాయబారి ఒనో కెయిచితో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీ, జపాన్ మధ్య ఉన్న అనుబంధంపై వీరు చర్చించారు. శ్రీసిటీలో ఇప్పటికే పలు జపాన్ కంపెనీలు ఉన్నాయని లోకేశ్ గుర్తుచేశారు. రాష్ట్రానికి మరిన్ని జపాన్ పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు ఆయన ‘X’ వేదికగా వెల్లడించారు.


