News February 18, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి..

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ ధరలు దిగొస్తున్నాయి. కాగా పల్నాడు జిల్లాలో ధరలపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో రూ.50- రూ.100 మేర ధర పడిపోగా జిల్లాలో రూ.30 మేర మాత్రమే తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.230లు, స్కిన్తో రూ. 210లుగా ఉంది. గతవారం కేజీ రూ.260-280 వరకు ఉంది. మరోవైపు మటన్ ధర రూ.900 వద్ద నిలకడగా కొనసాగుతుంది. 100గుడ్లు రూ.420 వరకు అమ్ముతున్నారు.
Similar News
News September 15, 2025
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 111 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 111 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 02, రెవెన్యూ 11, ప్రజారోగ్యం 13, పట్టణ ప్రణాళిక 51, ఇంజినీరింగు 28, మొక్కల విభాగమునకు 03, యుజీడీ విభాగమునకు 03 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
జిల్లాలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

జిల్లాలో సోమవారం 35 కేంద్రాలలో యూరియా పంపిణీ చేసినట్లు బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలోని రైతు సంరక్షణా కేంద్రాలు, పిఏసీఎస్లలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 220 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. నేడు 4,983 మంది రైతులకు యూరియా పంపిణీ చేశామని తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దన్నారు.
News September 15, 2025
గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం: నిర్మల్ ఎస్పీ

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే గ్రీవెన్స్ సెల్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం, ఆ అర్జీలను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు అధికారులు కృషి చేయాలని SP సూచించారు.