News December 21, 2025

పల్నాడులో పాడి సిరి.. లీటరు రూ. 100

image

పల్నాడు జిల్లాలో పాడి పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతోంది. స్వచ్ఛమైన పాలకు గిరాకీ పెరగడంతో పశువుల పెంపకం రైతులకు లాభసాటి ఆదాయ మార్గంగా మారింది. ఆరోగ్య స్పృహ పెరిగిన వినియోగదారులు చిక్కటి గేదె పాలను లీటరు రూ.100 వరకు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగుకు తోడుగా పాడిని పెంచుకుంటూ రైతులు నెలకు ఆశించిన స్థాయిలో ఆదాయం పొందుతున్నారు.

Similar News

News December 21, 2025

ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

image

₹600Cr అదనపు ఆదాయమే లక్ష్యంగా <<18630596>>రైల్వే ఛార్జీలను <<>>పెంచింది. అయితే కొత్తగా ఏం సౌకర్యాలు కల్పించారని ఈ రేట్ల పెంపు అనే ప్రశ్నలు వస్తున్నాయి. పండుగలొస్తే నిలబడి ప్రయాణించే పరిస్థితి మారలేదు. ముక్కుబిగబట్టి టాయిలెట్‌కు వెళ్లే దుర్భర స్థితిలోనూ మార్పులేదు. సరైన సమయానికి రైలు స్టేషన్‌కు వచ్చిన రికార్డూ లేదు. కరోనాలో ఆగిపోయిన వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించలేదు. మరి ఎందుకు ఛార్జీల పెంపు?

News December 21, 2025

డబ్బు కాదు.. హ్యాపీ లైఫ్ సీక్రెట్ ఇదే

image

డబ్బు, పేరు ప్రతిష్ఠలే సంతోషాన్ని ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సమాజంలో ఉన్న బంధాలే నిజమైన ఆనందాన్ని ఇస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీలో తేలింది. మన అనుకునే కొద్దిమంది ఉన్నా చాలని వారితో సంతోషంగా ఉండొచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అది లేకుంటే ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. నా అనుకునే వారు పక్కన ఉంటే ఆ హ్యాపీయే వేరని తెలిపారు.

News December 21, 2025

సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

image

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకల పర్యవేక్షణలో అధికార యంత్రాంగమంతా నిమగ్నమై ఉండటంతో అర్జీల స్వీకరణను రద్దు చేసినట్లు ఆమె వివరించారు.