News November 19, 2025
పల్నాడులో 2,40,530 మంది రైతులు అర్హులు

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం బుధవారం రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేయనుంది. 2,40,530 మంది రైతుల ఖాతాలో రూ.168,37 కోట్లు జమ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. నియోజకవర్గం వారీగా.. సత్తెనపల్లి 36,752, నరసరావుపేట 20,463, చిలకలూరిపేట 21,669, పెదకూరపాడు 41,149, గురజాల 35,676, వినుకొండ 45,898, మాచర్ల 38,923 రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.7000 ఆర్థిక సహాయం చేస్తుంది.
Similar News
News November 21, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
News November 21, 2025
దేవుడు ఎంత గొప్పవాడంటే ?

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||
సృష్టి ఆరంభంలో సమస్త ప్రాణులు దేని నుంచి ఉద్భవిస్తాయో, తిరిగి యుగం ముగిసే సమయంలో దేనిలో లయమైపోతాయో.. ఆ పరమ పవిత్ర పదార్థమే పరమాత్ముడు. ఆయన ఈ జగత్తును నడిపిస్తాడు. నిరంతరం జరిగే సృష్టి-లయ చక్రంలో ఆయనే ముఖ్యపాత్రుడు. అలాంటి భగవంతుడికి మన కోర్కెలు తీర్చడం పెద్ద విషయం కాదు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 21, 2025
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం ఈనెల 30 లోగా పూర్తి చేయనుంది. <<18316925>>అర్హులైన<<>> వారు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో పరిశీలించి, సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటిస్తారు. 29వ తేదీకల్లా బదిలీల ఆర్డర్ జారీ చేయడంతోపాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.


