News May 20, 2024
పల్నాడు అల్లర్లపై డీజీపీకి అందించిన నివేదికలో వివరాలివే..

ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. 581 మందిపై కేసు నమోదు చేసి, 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 91 మందికి 41A నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. మరికాసేపట్లో నివేదికను సీఈవో, సీఈసీకి పంపనున్నట్లు తెలుస్తుంది.
Similar News
News April 23, 2025
గుంటూరులో రికవరీ ఏజెంట్ ఆత్మహత్య

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
News April 23, 2025
గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
News April 23, 2025
24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.