News March 1, 2025

పల్నాడు: ఇంటర్ పరీక్షలకు 759 మంది గైర్హాజరు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా శనివారం 48 పరీక్ష కేంద్రాలలో ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 17,313 మందికి గాను 16,554 మంది విద్యార్థులు హాజరయ్యారు. 759 మంది హాజరు కాలేదు. 95.62 హాజరు శాతంగా జిల్లా అధికారి నీలావతి తెలిపారు. ఒకేషనల్ కు సంబంధించి 1,168 మంది గాను 1,037 మంది హాజరయ్యారని, మొత్తంగా ఇంటర్ పరీక్షల హాజరు శాతం 95.18గా నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 1, 2025

దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

image

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.

News March 1, 2025

నేలపై కూర్చుని తింటున్నారా?

image

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్‌లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.

News March 1, 2025

గాలికుంటు టీకాల పోస్టర్ల ఆవిష్కరణ

image

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం 01/03/25 నుంచి 30/03/25 తేదీ వరకు ఉచితంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.

error: Content is protected !!