News February 23, 2026

పల్నాడు: ఉద్యోగం పేరిట రూ.లక్షల్లో మోసం..!

image

గుండ్లపల్లికి చెందిన యువకుడు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకొచ్చింది. బాధిత యువకుడు నరేష్‌కు జాబ్ ఇప్పిస్తానని చెన్నైకు చెందిన నిందితుడు అరుణ్ నమ్మబలికించాడు. దీంతో అతను అరుణ్ ఖాతాకు ఆన్లైన్ ద్వారా రూ.6.30లక్షలు చెల్లించాడు. ఉద్యోగం కల్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ‘మా బాబాయి మంత్రి’ అంటూ సాకులు చెప్పి ఫోన్ బ్లాక్ చేశాడన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు SPకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

Similar News

News February 27, 2026

బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: సూర్య

image

బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, బౌలింగ్ విభాగంలో ఇంకాస్త ‘క్లినికల్’గా ఉండాల్సిందని జింబాబ్వేపై విజయం తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ అద్భుతంగా ఆడారని, సండే WI తో మన బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కోల్‌కతాలో విండీస్‌తో జరిగే సెమీఫైనల్ బెర్త్ పోరుకు తమ వ్యూహాలను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News February 27, 2026

ఆంథ్రోపిక్‌కు పెంటగాన్ అల్టిమేటం!

image

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రముఖ AI సంస్థ ‘ఆంథ్రోపిక్’కు డెడ్ లైన్ విధించింది. తమ Claude మోడల్‌ను మిలిటరీ అవసరాలకు, నిఘా పనులకు వాడుకోవడానికి అనుమతించాలని, లేదంటే ఫిబ్రవరి 27 సాయంత్రం కల్లా ₹1,600 కోట్ల కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించింది. కంపెనీని ‘సప్లై చైన్ రిస్క్’గా ప్రకటించి బ్లాక్ లిస్ట్‌లో పెడతామని అల్టిమేటం ఇచ్చింది. AIని యుద్ధానికి ఉపయోగించాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది.

News February 27, 2026

సీక్రెట్‌గా భారత్‌కు ట్రంప్ దూత!

image

గ్లోబల్ టారిఫ్స్‌ చెల్లవని కొట్టేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు భారతే వచ్చి ‘సారీ’ చెబుతుందన్న US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్ ఇప్పుడు స్వయంగా ఢిల్లీకి వచ్చి పీయూష్ గోయల్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. కోర్టు తీర్పుతో ట్రంప్ బార్గెయినింగ్ పవర్ తగ్గడంతో భారత్ తన వాషింగ్టన్ పర్యటనను వాయిదా వేసి పట్టు సాధించింది. దీంతో కంగారుపడ్డ ట్రంప్ ‘గేమ్స్ ఆడకండి’ అని వార్నింగ్ ఇచ్చారు.