News March 24, 2024
పల్నాడు: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వాలంటీర్పై వేటు

కారంపూడి మండలంలోని కారంపూజీ-2లో వాలంటీర్గా పని చేస్తున్న షేక్. మజూజి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫొటోలు, వీడియోలు స్టేటస్గా పెట్టడం వల్ల, అతడ్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 10, 2025
తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 9, 2025
తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్ధనరావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి ,పేరేచర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాశ్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా అరెస్టు చేసి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News April 9, 2025
గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా హుబ్లీ-కతిహార్ మార్గంలో కొత్తగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. హుబ్లీ-కతిహార్(07325) ప్రత్యేక రైలు ఏప్రిల్ 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతీ బుధవారం హుబ్లీ నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా కతిహార్ చేరనుంది. ఇదే మార్గంలో కతిహార్-హుబ్లీ(07326) రైలు ఏప్రిల్ 12 నుంచి మే 3వ తేదీ వరకు ప్రతి శనివారం కతిహార్ నుంచి బయలుదేరుతుంది.