News May 19, 2024

పల్నాడు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేశ్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన శివ శంకర్ బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, కలెక్టరేట్లోనే వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తారని బాలాజీ తెలిపారు.

Similar News

News April 23, 2025

గుంటూరులో రికవరీ ఏజెంట్ ఆత్మహత్య

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

News April 23, 2025

గుంటూరు యువకుడిపై కడప యువతి ఫిర్యాదు

image

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటున్నప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.

News April 23, 2025

24 నుంచి సెలవులు.. ఆదేశాలు పాటించాలి: DEO

image

గుంటూరు జిల్లాలోని పాఠశాలలన్నింటికీ ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోనోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాటించాలని సూచించారు.

error: Content is protected !!