News March 22, 2024

పల్నాడు: కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా జానీ

image

పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా దాచేపల్లికి చెందిన కరాలపాటి జానీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జానీ శుక్రవారం దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనను గుర్తించి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

Similar News

News September 7, 2025

సంగీత దర్శకుడు BNR మన కొలకలూరు వారే

image

తెలుగు సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహరావు (బి.ఎన్.ఆర్.) గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. జనవరి 24, 1905న జన్మించిన ఆయనకు 8 ఏళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆయన మొదటి సినిమా సతీ తులసి (1936), ఆఖరి చిత్రం అర్ధాంగి (1955). సెప్టెంబర్ 7, 1976న ఆయన మరణించారు. ఆయన తెలుగు సినిమా సంగీతానికి ఎనలేని సేవలు అందించారు.

News September 7, 2025

GNT: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీకి 31వ ర్యాంకు

image

కేంద్ర విద్యాశాఖ జాతీయ సంస్థల ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకటించిన ర్యాంకుల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 31వ స్థానానికి పడిపోయింది. 2024లో 26వ ర్యాంకు సాధించిన ఈ యూనివర్సిటీ పాలకమండలి లేకపోవడం, శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రతిష్ఠకు గండి పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 7, 2025

గుంటూరులో నేడు చికెన్ ఎంతంటే?

image

గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్‌తో అయితే రూ.220కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.950 – 1020 మధ్య కొనసాగుతుంది. చేపల్లో బొచ్చ రూ.200, రాగండి రూ.180గా విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.