News April 16, 2025
పల్నాడు: కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి.. అరెస్ట్

సొంత కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తునకు తీసుకున్నారు. నిందితుడిని తెనాలిలోని కొలకలూరు కాలువ కట్టవద్ద గుర్తించి, రూరల్ సీఐ ఉమేశ్ చంద్ర, ఎస్ఐ కట్టా ఆనంద్ బృందం మంగళవారం అదుపులోకి తీసుకుంది. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News April 16, 2025
HYD: బాలికపై లైంగికదాడికి యత్నం

బాలికపై లైంగిక దాడికి యత్నించిన మారుతండ్రిపై కేసు నమోదైంది. HYD కమలావరి కాలనీలో నివాసముండే ఓ మహిళ భర్తతో విడిగా కుమార్తె(10)తో కలిసి ఉంటుంది. కాకినాడకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. HYDలో ఇద్దరు సహజీవనం చేయడం ప్రారంభించారు. మహిళ గర్భవతి అయింది. ప్రసవానికి ఆస్పత్రికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె కుమార్తెపై మారుతండ్రి కన్నెసి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక స్థానికుల సాయంతో PSలో కంప్లైంట్ చేసింది.
News April 16, 2025
ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్

TG: కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నగరంలోని 400 ఎకరాల అడవిని రక్షించడానికి విద్యార్థులు, అధ్యాపకులు అవిశ్రాంతంగా కృషి చేశారని అభినందించారు. ఆ భూముల తనఖా వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీని రికమెండ్ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.
News April 16, 2025
ఇక టోల్ గేట్లు ఉండవు: మంత్రి

జాతీయ రహదారులపై ఉండే టోల్గేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.