News February 24, 2025

పల్నాడు: కోటప్పకొండ జాతరకు రహదారులు సిద్ధం 

image

నరసరావుపేటలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పురస్కరించుకొని జరిగే త్రికోటేశ్వరస్వామి జాతరకు రహదారులు సిద్ధమయ్యాయి. 10 రోజులుగా ప్రభుత్వ శాఖలు కొండకు వచ్చే రహదారులలో మరమ్మతులు చేపట్టాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, పెట్లూరు వారిపాలెం, జేఎన్టీయూ, పమిడిమర్రు, గురవాయపాలెం కాలువ కట్ట రోడ్లు, గిరి ప్రదక్షిణ మార్గాలు వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వచ్చాయి. 

Similar News

News September 18, 2025

TODAY HEADLINES

image

⁎ హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరదమయమైన రోడ్లు
⁎ TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
⁎ 1-12 తరగతుల వరకు సమూల మార్పులు: CM రేవంత్
⁎ ప్రధాని మోదీ భారత్‌కు అతిపెద్ద ఆస్తి: సీఎం చంద్రబాబు
⁎ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
⁎ కొత్త పార్టీని ప్రకటించిన MLC తీన్మార్ మల్లన్న
⁎ EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC
⁎ ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టు ఘనవిజయం

News September 18, 2025

HYD: సైకిళ్లపై తిరుగుతూ.. తామున్నామంటున్న మహిళా పోలీస్

image

నాగోల్ PS పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మహిళా పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వీధుల్లోకెళ్లి తెలుసుకున్నారు. గృహహింస, వేధింపులు, అవాంఛనీయ ప్రవర్తన, మద్యం మత్తులో అల్లర్ల సమస్యలపై అవగాహన కల్పించారు. ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలిచి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డయల్ 100, 112, షీ టీమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని స్థానికులకు సూచించారు.

News September 18, 2025

ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

image

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.