News March 23, 2024
పల్నాడు: గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో మంటలు

గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2025
గుంటూరులో గుర్తుతెలియని మృతదేహం.!

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడిగుడ్డు సత్రం వద్దనున్న సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద సుమారు 30ఏళ్ల వయస్సు కలిగిన యువకుడు బుధవారం చనిపోయి పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వివరాల కోసం పరిసర ప్రాంతాల్లో విచారించినా ఫలితం దక్కలేదు. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా నిర్ధారించుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీలో భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిస్తే చెప్పాలన్నారు.
News April 10, 2025
తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 9, 2025
తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్ధనరావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి ,పేరేచర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాశ్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా అరెస్టు చేసి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.