News October 24, 2025

పల్నాడు జిల్లాకు అందివస్తున్న అవకాశాలు

image

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల అమలుకు కార్యాచరణ ప్రారంభించడంతో పల్నాడు జిల్లాకు అవకాశాలు అందిస్తున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే, చెన్నై కారిడార్ బుల్లెట్ ట్రైన్ పల్నాడు జిల్లా మీదగా అమరావతికి చేరే విధంగా DPRలు సిద్ధమయ్యాయి. నాగార్జునసాగర్ ఎయిర్పోర్ట్, మాదిపాడు వద్ద కృష్ణానదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం పల్నాడులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బాటలు వేయనున్నాయి.

Similar News

News October 24, 2025

ప్రకాశం: విద్యుత్ సమస్య తలెత్తితే కాల్ చేయండి.!

image

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ లైన్లు తెగిపడితే తప్పక విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా కంట్రోల్ రూమ్ నంబర్ 9440817491కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

News October 24, 2025

పెనుగొండ: గంజాయి కలిగి ఉన్న యువకులు అరెస్ట్

image

పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ వద్ద గంజాయితో ఉన్న ఐదుగురు యువకులను పెనుగొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెనుగొండకు చెందిన సాయి నాగేంద్ర, దుర్గాసాయి, చందు, దానేశ్వరరావు, సిద్ధాంతానికి చెందిన సాయిరాంను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై గంగాధర్ తెలిపారు.

News October 24, 2025

ఓయూ MBA పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.