News January 8, 2026

పల్నాడు జిల్లాకు మణిహారంగా అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ!

image

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా నవ నగరాలు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాకు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించనుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో భూ సమీకరణ ప్రారంభం సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయం వెల్లడించారు. 7,465 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పల్నాడు జిల్లాకు స్పోర్ట్స్ సిటీ మణిహారం కానుంది.

Similar News

News February 13, 2026

ఆలస్యంగా వరి నాట్లు.. కలుపు నివారణ

image

ఆలస్యంగా వరి నాటిన పొలంలో 15-20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లు గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో సైహలోపాప్ బ్యుటైల్ 10% ఇ.సి 400ml ద్రావణం లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 10% S.C ద్రావణం 80ML కలిపి పిచికారీ చేయాలి. అదే అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉంటే నాటిన 20-25 రోజుల వేళ 200 లీటర్ల నీటిలో ఎకరాకు 2,4 డి.సోడియం సాల్ట్ 80% పొడి 400 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News February 13, 2026

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

image

TG: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేస్తారు. 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్ చేసి వెయ్యి ఓట్ల(ఒక రౌండ్)ను ఒక కట్టగా ఉంచుతారు. ఓట్లను బట్టి రౌండ్ల వారీగా ప్రతీ బ్యాలెట్ పేపర్‌ను ఏజెంట్‌కు చూపిస్తూ లెక్కింపు సాగుతుంది. చివరకు ఫలితాలు ప్రకటిస్తారు.
* ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు Way2Newsను ఫాలో అవ్వండి.

News February 13, 2026

శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు

image

శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 16 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 24 గంటలు రాకపోకలకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2.59 లక్షలకు పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 3వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.