News April 14, 2025

పల్నాడు జిల్లాలో ఇద్దరికి షైనింగ్‌స్టార్ అవార్డులు

image

ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని నీలావతి దేవి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన స్వయంగా ఈ అవార్డులు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి పమ్మి కీర్తన (970 మార్కులు), జంగా కీర్తన (902 మార్కులు) ఎంపికయ్యారని నీలావతి దేవి వెల్లడించారు.

Similar News

News November 6, 2025

సూర్యాపేట: ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో రూ.3 కోట్ల మోసం

image

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. సూర్యాపేటకు చెందిన గడ్డం లక్ష్మణ్ కుమార్ ట్రేడింగ్ పేరుతో సూర్యాపేట, తిరుమలగిరి ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసి రూ.3 కోట్లు కాజేశాడని వివరించారు. ఈ మోసగాడి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.

News November 6, 2025

వేములవాడ: 16వ రోజు కొనసాగుతున్న కార్తీక దీపోత్సవం

image

వేములవాడ రాజన్న క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం 16వ రోజు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నిత్యం ఆలయాల ఆవరణలో దీపోత్సవం నిర్వహించాలని దేవాదాయ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు భీమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఏఈవో అశోక్ కుమార్ దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News November 6, 2025

అన్ని కార్యాలయాల్లో రేపు సామూహిక వందేమాతరం

image

బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాలని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని కలెక్టర్ సూచించారు.