News April 12, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పల్నాడుకు 23(ప్రథమ), 9( ద్వితీయ) స్థానాలు, ☞ అమరావతి: మద్యం మత్తులో హత్యకు గురైన కోటేశ్వరరావు, ☞ నరసరావుపేట: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన, ☞ నాదెండ్ల: పురుగు మందు తాగి వృద్ధురాలు మృతి, ☞ ఈపూరు: వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, ☞మాచర్ల: రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.
Similar News
News July 7, 2025
కొత్త రైల్వే లైన్లకు సిద్ధమవుతున్న DPRలు

TG: డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి DPRలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు నెలాఖరుకు ఇవి రైల్వే బోర్డుకు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 2 లేన్ల నిర్మాణానికి రూ.7,460 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. డోర్నకల్-గద్వాల లైన్ను కాచిగూడ రైల్వే లైన్కు, డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్ను గుంటూరు-BBనగర్ లైన్కు లింక్ చేస్తారు.
News July 7, 2025
ప్రతి తల్లి రెండు మొక్కలు పెంచాలి: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో ప్రతి తల్లి రెండు మొక్కలు నాటి పెంచాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. వనమహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘పెద్దలు మనమే వనం.. వనమే మనం అన్నారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలం. తల్లులు మొక్కలు నాటితే తమ పిల్లల్ని చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరిట మొక్కలు నాటాలి’ అని కోరారు.
News July 7, 2025
‘కాంతార చాప్టర్-1’ రిలీజ్ డేట్ వచ్చేసింది

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కాంతార చాప్టర్-1’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. 2022లో విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘కాంతార’కు ప్రీక్వెల్గా ఈ మూవీ రూపొందుతోంది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.