News August 9, 2024

పల్నాడు జిల్లాలో మహిళ దారుణ హత్య

image

నాదెండ్ల మండలం గణపవరంలో మహిళ హత్య కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. షేక్ కరిమూన్ అనే మహిళ ఒంటరిగా గ్రామ మసీదులోని ఓ గదిలో ఉంటుంది. ఒడిశా నుంచి కూలి పనికి వచ్చిన రాజు కూడా అదే మసీదులో ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి కరిమూన్ గదిలోకి ప్రవేశించి ఆమెను హత్య చేసి పరారయ్యాడు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 2, 2026

GNT: స్టాఫ్ నర్సు పోస్టులకు భారీ పోటీ.. 7,500 దరఖాస్తులు

image

పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. 150 కాంట్రాక్ట్ పోస్టులకు 7,500 దరఖాస్తులు అందాయి. మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక చేపడతారు. ఉద్యోగాల పేరుతో దళారులను నమ్మవద్దని RD శోభరాణి హెచ్చరించారు. కాగా గుంటూరు ఆర్డీ కార్యాలయం గత నెల నోటిఫికేషన్ ఇచ్చింది.

News April 2, 2026

GNT: ధాన్యం బకాయిల చెల్లింపులో ఆలస్యం.. రైతుల ఆందోళన

image

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించిన ప్రభుత్వం, ఇతర బకాయిలలో జాప్యం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రవాణా ఖర్చులు, గన్నీ సంచుల కోసం రూ.33 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. బాపట్ల జిల్లాకే ఎక్కువ భాగం ఉంది. గుంటూరు, పల్నాడు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. హమాలీ చార్జీలు ఇప్పటికే ఇచ్చారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెండింగ్ మొత్తాలు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

News April 1, 2026

GNT: ఈ ప్రాంతాల్లోనే పెరిగిన వార్డుల సంఖ్య

image

@తెనాలి ప్రస్తుతం 40 వార్డులు ఉండగా 52కు పెరిగాయి
@రేపల్లె ప్రస్తుతం 28 వార్డులు ఉండగా -36కు పెరిగాయి
@మాచర్ల ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@సత్తెనపల్లి ప్రస్తుతం 31 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@వినుకొండ ప్రస్తుతం 32 వార్డులు ఉండగా 36కు పెరిగాయి
@గురజాల ప్రస్తుతం 20 వార్డులు ఉండగా 23కు పెరిగాయి