News September 13, 2025
పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా కృష్ణారావును పల్నాడుకు ప్రభుత్వం బదిలీ చేసింది. పలు కేసులలో సమర్థవంతంగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ మన్నన్నలు, ప్రజాభిమానం పొందారు. కాగా ప్రస్తుతం ఇప్పటివరకు పల్నాడు ఎస్పీగా పనిచేసిన కంచి శ్రీనివాసరావుకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
Similar News
News September 13, 2025
9 నెలల్లోపే ఆ స్థానాలకు ఉపఎన్నికలు: KTR

TG: తాము అధికారంలో ఉన్న సమయంలో గద్వాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని KTR అన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 22 నెలలు గడిచినా ఏమీ చేయలేదని మండిపడ్డారు. BRSలోనే ఉన్నానని చెబుతున్న గద్వాల MLA కృష్ణమోహన్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 9 నెలల్లోపే ఫిరాయింపు స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని గద్వాల సభలో అన్నారు.
News September 13, 2025
15న తిరుపతికి రానున్న మారిషస్ PM

మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగుళం ఈనెల 15న తిరుపతికి రానున్నారు. తిరుపతి సమీపంలోని రామాపురం బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
News September 13, 2025
మేడ్చల్: వామ్మో.. కరెంట్ బిల్లు చూసి షాక్..!

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్ సూరారం దొమ్మర పోచంపల్లి పరిధిలో వినియోగదారుడికి రూ.7 వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చి షాక్ అయ్యాడు. అధిక బిల్లు ఎందుకొచ్చిందని అధికారులను ప్రశ్నించాడు. ‘రెండు నెలలుగా అధిక బిల్లులపై కస్టమర్లు అడిగినా EE, మీటర్ రీడింగ్ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని బాధితుడు కోరాడు.