News November 24, 2025
పల్నాడు జిల్లా భవితవ్యం పై ఉత్కంఠ.!

జిల్లాల పునర్విభజన కసరత్తు తుది దశకు వచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడనున్న అమరావతి జిల్లా పరిధిలోకి చేర్చాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో పులిచింతల, ధ్యాన బుద్ధ, అమరావతి టెంపుల్ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నేడు జిల్లాల పునర్ విభజనపై అధికారులతో సమీక్షించనున్న క్రమంలో ఆసక్తి నెలకొంది.
Similar News
News November 25, 2025
UAEలో సెటిల్ అవ్వాలని ప్లాన్లు.. ఎందుకిలా?

భారతీయులతో పాటు ఇతర దేశస్థులూ యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, మెరుగైన మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీస్, సేఫ్టీ అని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఆయిల్ ఎగుమతులు, కార్పొరేట్ ట్యాక్స్, హోటళ్లు, వీసా, లైసెన్స్ ఫీజులు, టోల్ ట్యాక్స్ ద్వారా ఆదాయం తెచ్చుకుంటుంది. దీంతో పెద్దపెద్ద <<18378539>>వ్యాపారవేత్తలకు<<>> దుబాయ్ డెస్టినేషన్గా మారింది.
News November 25, 2025
వెట్లాండ్ రక్షణ బాధ్యత మనదే: సిద్దిపేట కలెక్టర్

సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధ్యకతన సోమవారం నిర్వహించారు. సుప్రీంకోర్టు దేశం మొత్తంలో ఉన్న వెట్ ల్యాండ్ సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల జారీ చేసిందని దీనికి సంబంధించి జిల్లాలో 8చెరువులు ఎంపిక చేసినట్లు ఆ చెరువుల మొత్తం విస్తీర్ణం డిజిటల్ మ్యాపింగ్, లోతు, వర్షపాతం, చేపల సామర్ధ్యం, లాంటి విషయాలు సేకరించాలన్నారు
News November 25, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

NLG: మహిళా ఓట్ల కోసం వ్యూహం
NLG: కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఏర్పాట్లు వేగవంతం.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
NLG: ఉత్కంఠకు తెర.. రిజర్వేషన్లు ఖరారు
NLG: సర్కార్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం
నకిరేకల్: జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు
నార్కట్ పల్లి: ఎంజీయూ రిఫ్రిజిరేటర్లో కప్ప.. ఏబీవీపీ ధర్నా
NLG: టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఇదీ పరిస్థితి


