News January 8, 2026
పల్నాడు జిల్లా వైసీపీ ఐటీ కార్యదర్శిగా సుకమంచి

పల్నాడు జిల్లా వైసీపీ ఐటీ విభాగం కార్యదర్శిగా రొంపిచర్ల మండలం రెడ్డిపాలెంకు చెందిన సుకమంచి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ MLA గోపిరెడ్డి సహకారంతో ఈ పదవి లభించిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఐటీ విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
Similar News
News February 20, 2026
మదనపల్లెలో ఏం జరుగుతోంది..?

మదనపల్లె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. కిడ్నీ రాకెట్, కల్తీ మద్యం, ఫైల్స్ దగ్ధం, హత్యాచారం, గంజాయి విక్రయాలు వంటి నేరాలు జరుగుతున్నాయి. నేర ప్రవృత్తిని ఎంత తగ్గించాలని పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఇక్కడ ఉండే రౌడీలు, కిరాయి గూండాలను బెంగళూరులో దందాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News February 20, 2026
సిద్దిపేటం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశలు, నిలిచిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంజూరైన ఇల్లు గ్రౌండింగ్ కావాలని, ఎంపీడీఓలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు పూర్తయ్యే దశలో ఫోటో క్యాప్చర్ చేయాలని తెలిపారు.
News February 20, 2026
TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.


