News December 12, 2025
పల్నాడు: జిల్లా వైసీపీ మీడియా ప్యానలిస్ట్గా విజయభాస్కర్ రెడ్డి

వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వైసీపీ మీడియా ప్యానలిస్ట్గా సత్తెనపల్లికి చెందిన చిట్టా విజయభాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఈ జాబితాను విడుదల చేసింది. వైసీపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన చిట్టా, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్గా పనిచేశారు.
Similar News
News March 6, 2026
కామారెడ్డి: కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి

కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే స్థలం కేటాయించి సహకరించాలని వారు కలెక్టర్ను కోరారు.
News March 6, 2026
రేపు సీతంపేట ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ పర్యటన

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి శనివారం సీతంపేట ఐటీడీఏలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ గార్డెన్, ఇప్పకూడ గ్రామంలో ముస్తాబు కార్యక్రమం, జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్ను కలెక్టర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఐటీడీఏ సిబ్బంది పేర్కొన్నారు.
News March 6, 2026
22ఏ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించండి: కలెక్టర్

జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో 229 విజ్ఞప్తులు వచ్చాయని వాటిలో 18 మాత్రమే పరిష్కరించడం జరిగిందని,10 కేసులు రిజెక్ట్ అయ్యాయన్నారు. 2249 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉండగా, 2184 పంపిణీ చేశారన్నారు.


