News January 2, 2026
పల్నాడు: టిప్పర్ ఢీకొని మహిళ మృతి

క్రోసూరు మండలం అందుకూరు వెళ్లే రోడ్డు మూల వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట కుమారిని లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. క్రోసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 8, 2026
దేవుడి విగ్రహాలు, చిత్రపటాలను ఏ రోజు శుభ్రం చేయాలి?

ఇంట్లో దేవుడి చిత్రపటాలు, విగ్రహాలను శుభ్రం చేయడానికి గురువారం శుభప్రదమైన రోజని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం, మంగళవారాల్లో వాటిని కదపకూడదని హెచ్చరిస్తున్నారు. ‘ప్రతి వారం వీలుపడకపోతే అమావాస్య రోజున శుభ్రం చేయాలి. అమావాస్య శుక్రవారం వస్తే గురువారమే శుద్ధి చేసుకోవాలి’ అని చెబుతున్నారు. దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు పొందాలంటే ఇంట్లో ఏయే విగ్రహాలు ఉండాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 8, 2026
GNT: కాలేజీ టాయిలెట్స్లో విద్యార్థి సూసైడ్.. కారణమిదేనా.?

గుంటూరులోని ఓ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన <<18792920>>విషయం తెలిసిందే.<<>> తెనాలి (M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకొని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.
News January 8, 2026
VJA: లోకల్కే పెద్దపీట.. సంక్రాంతికి 6వేల RTC సర్వీసులు.!

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని RTC కీలక నిర్ణయం తీసుకుంది. 8,432 ప్రత్యేక సర్వీసుల్లో 6వేల బస్సులను రాష్ట్రంలోని లోకల్ రూట్లలోనే నడపనుంది. ‘స్త్రీశక్తి’ పథకంతో పెరిగిన రద్దీ దృష్ట్యా స్థానిక ప్రాంతాలకు పెద్దపీట వేసింది. HYD, బెంగళూరు, చెన్నైల నుంచి వందలాది బస్సులు నడుపుతున్నా, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల ద్వారా గ్రామీణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.


