News March 31, 2025

పల్నాడు: రంజాన్ ప్రార్థనలకు వేలాది మంది హాజరు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గ కేంద్రాలలో మసీదులు కిటకిటలాడాయి. మండల కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. మత ప్రవక్తలు రంజాన్ విశిష్టత తెలియజేశారు. 

Similar News

News April 2, 2025

ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

image

సమ్మర్‌లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.

News April 2, 2025

DANGER: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా?

image

స్మార్ట్ ఫోన్లలో విపరీతంగా రీల్స్, షార్ట్స్ చూడటం వ్యసనంగా మారింది. దీనివల్ల బ్రెయిన్ రాట్(మేధో క్షీణత), కంటి జబ్బులు అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లల్లో మెల్లకన్ను, డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా కేసులు, పెద్దల్లో మైగ్రేన్, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. 20-20-20 రూల్(20ని.కోసారి 20సె.పాటు 20మీ. దూరంలో వస్తువులపై దృష్టి పెట్టడం) పాటించాలని సూచిస్తున్నారు.

News April 2, 2025

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అక్రమార్కుడు: ఎమ్మెల్యే

image

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు. 

error: Content is protected !!