News April 1, 2025

పల్నాడు: రూ.54.9 కోట్లతో హైవే రోడ్డు పనులు 

image

పల్నాడు జిల్లాలో హైవే రోడ్డు-167కు సంబంధించి కేంద్రం రూ.54.9 కోట్లు మంజూరు చేసింది. హైవే రోడ్డు నడికుడితో పాటు మార్కాపురం మీదగా వెళుతుంది. పూర్తిస్థాయిలో నిధులు అందకపోవడంతో రోడ్డు పనులు మధ్యలో ఆగాయి. హైవే రోడ్డుకు సంబంధించి విడుదలైన నిధులతో మాచర్ల, రెంటచింతల, పాల్వాయి గేటు, గురజాల మండలాలకు సంబంధించి ఫ్లై ఓవర్లు రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించనున్నారు. నిధులపై జిల్లా ఎమ్మెల్యేలు హర్షం తెలిపారు. 

Similar News

News January 7, 2026

NLG: సన్న బియ్యం.. క్వాలిటీ పట్టించుకోవట్లే!

image

ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాణ్యత క్రమక్రమంగా తగ్గుతుంది. గత మూడు నాలుగు నెలల నుంచి సన్నబియ్యంలో అధికంగా నూకలు, తౌడు, మెరిగెలు, రాళ్లు వస్తుండడంతో పాటు ముక్క వాసన వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11,54,178 రేషన్ కార్డులు ఉండగా.. 22,132 టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంది. వీటిని తినడానికి 40 శాతం పైగానే మంది ఆసక్తి కనబరచడం లేదు.

News January 7, 2026

నల్గొండ: బైకర్లూ.. హెల్మెట్ల బూజు దులపండి!

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన అమలులోకి రానుంది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయవద్దని బంకు యజమానులకు సూచించారు. ప్రాణ రక్షణ కోసం బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

News January 7, 2026

కడప: మీ నోడల్ అధికారి వీరే.!

image

ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం కోసం ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప- కమిషనర్ మనోజ్ రెడ్డి
➤ జమ్మలమడుగు- RDO సాయి శ్రీ
➤ ప్రొద్దుటూరు- ZP CEO ఓబులమ్మ
➤ పులివెందుల- PD DRDA రాజ్యలక్ష్మి
➤ మైదుకూరు- డ్వామా PD ఆదిశేషారెడ్డి
➤ బద్వేల్‌- RDO చంద్రమోహన్
➤ రాజంపేట- సబ్ కలెక్టర్ భావన
➤ కమలాపురం- కడప RDO జాన్ ఇర్విన్.