News December 10, 2025

పల్నాడు: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు.?

image

టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Similar News

News December 16, 2025

MDK: ఓట్లకు నోట్ల వాన..!

image

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడో విడత రేపు (17న) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ధూళిమిట్ట మండలంలోని ఓటుకు కనీసం రూ.500 నుంచి రూ.2 వేలకు పైనే పంపిణీ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి, ఓటు వేయాలని కోరుతున్నారు. మద్యం పంపిణీ కూడా జోరుగా సాగుతుందని ఆరోపణలొస్తున్నాయి.

News December 16, 2025

కర్నూలు: మీ ముగ్గులు మా Way2Newsలో..!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మా Way2Newsకి పంపండి. మీ పేరుతో మేము పబ్లిష్ చేస్తాం.
ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.